న్యూఢిల్లీ, మే 5: రాజద్రోహం చట్టాన్ని రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను ఐదుగురు జడ్జిల రాజ్యాంగ విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలా.. వద్దా.. అన్నదానిపై ఈ నెల 10న వాదనలు వింటామని సుప్రీం కోర్టు తెలిపింది. చట్టం రద్దుపై కేంద్రం తన అభిప్రాయం తెలపడానికి గడువు ఇచ్చింది. ఈ అంశంలో అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అమికస్ క్యూరీగా ఉన్నారు. పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి పంపాల్సిన అవసరం లేదని, చట్టం దుర్వినియోగం కాకుండా మార్గదర్శకాలు జారీ చేస్తే చాలని అభిప్రాయపడ్డారు.
సుప్రీం జడ్జిలుగా ఇద్దరి పేర్లు సిఫారసు
గౌహతి హైకోర్టు సీజేజస్టిస్ సుధాన్షు ధూలి యా, గుజరాత్ హైకోర్టు జడ్జి జస్టిస్ జంషెడ్ బీ పార్దివాలాను సుప్రీంకోర్టు జడ్జిలుగా నియమించాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది.