హైదరాబాద్: ప్రముఖ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ “కూ యాప్లో ఈ ఏడాది పలు అంశాలు ట్రెండ్ అయ్యాయి. ఏప్రిల్, మే నెలల్లో కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో “కూ” యాప్పై గణనీయమైన ట్రాక్షన్ను సాధించింది. కూ యాప్ అనేకమైన సహాయక చర్యలకు సంబందించిన వివరాలు తమ ప్లాటుఫామ్ లో పొందుపరిచింది.ఆసుపత్రిలో పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు,ప్లాస్మా దాతల సమాచారం తెలుసుకునేందుకు వీలుకల్పించింది.
నీరజ్ చోప్రా, మీరాబాయి చాను, రవి దహియా,పివిసింధు,ఇతర అథ్లెట్ల అద్భుతమైన విజయాలను యూజర్స్ సంబరాలు జరుపుకోవడంతో టోక్యో -2020 సమ్మర్ ఒలింపిక్స్ ప్లాట్ఫామ్లో ట్రెండ్ అయ్యింది. టోక్యో-2020,T20 ప్రపంచ కప్ 2021,T20 WC ఫైనల్, పారాలింపిక్స్, భారతదేశం-పాకిస్తాన్ ప్రపంచ కప్ వంటి ఐదు అత్యంత చర్చనీయాంశమైన ఈవెంట్లతో, క్రీడలు ప్లాట్ఫారమ్పై గణనీయమైన ట్రాక్షన్ను పొందాయి .
“కూ” సెలబ్రిటీస్: కూ ప్లాట్ఫామ్లో అన్ని భాషలలో ఎక్కువగా ప్రస్తావించిన ప్రముఖులు నీరజ్ చోప్రా, విరాట్ కోహ్లిలు. ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా అద్భుతమైన ప్రదర్శనను ప్రశంసించారు. హిందీలో ఒలింపిక్ రజత పతక విజేత మీరాబాయి చాను గేమ్స్లో ఆమె విజయానికి అభిమానులు అధిక సంఖ్యలో మద్దతు ఇవ్వడంతో ఆమె ట్రెండ్ అయ్యింది. లెజెండరీ బాలీవుడ్ సూపర్ స్టార్ దిలీప్ కుమార్ మృతికి కూస్టర్లు పెద్ద సంఖ్యలో సంతాపం తెలిపారు. మరాఠీలో కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ప్లాట్ఫామ్పై బ్లాక్ ఫంగస్ ట్రెండ్గా మారాయి.
కన్నడ సూపర్స్టార్ పునీత్ రాజ్కుమార్ మరణం, తెలుగులో ఎస్ ఎస్ రాజమౌళి RRR ప్లాట్ఫామ్లో ట్రెండ్ అయింది. “కూ”యాప్ ప్రస్తుతం హిందీ, మరాఠీ, కన్నడ, తెలుగు, బెంగాలీ, తమిళం, అస్సామీ, గుజరాతీ, పంజాబీ,ఇంగ్లీష్ వంటి పది భాషలలో అందుబాటులో ఉంది. ఇది ఇటీవల 20 మిలియన్ డౌన్లోడ్ల మైలురాయిని చేరుకుంది. 2022లో 100 మిలియన్ డౌన్లోడ్లను చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నది.