లక్నో: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో దారుణం జరిగింది. షాజాహన్పూర్లో ఓ మేనేజర్(Manger)ను చితక్కొట్టి చంపేశారు. ఆ తర్వాత ఆ మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి ముందు పడేశారు. ట్రాన్స్పోర్టు వ్యాపారవేత్త వద్ద శివమ్ జోరీ(Shivam Jori) అనే వ్యక్తి మేనేజర్గా చేస్తున్నాడు. అయితే ఓ పార్సిల్ మిస్సింగ్ విషయంలో అతనిపై ఆ కంపెనీ ఓనర్లు అటాక్ చేశారు. ఓ పోల్కు కట్టేసి మరీ అతన్ని రాడ్డుతో చిదకబాదారు. ఆ మేనేజర్ దొంగతానానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
A man in Uttar Pradesh's #Shahjahanpur was beaten to death. Video showed man tied to a pole and a man repeatedly hit him with a rod. The manager was reportedly accused of theft.#UttarPradesh #crime pic.twitter.com/H1D4oJntdK
— Anil Kumar Verma (@AnilKumarVerma_) April 13, 2023
మేనేజర్ శివమ్ దొంగతనం చేసి ఉంటాడని అతన్ని కొట్టారు. మెడికల్ కాలేజీ వద్ద అతన్ని శవాన్ని పడేసినట్లు పోలీసులు గుర్తించారు. కరెంటు షాక్ వల్ల అతను చనిపోయినట్లు ఫ్యామిలీ మెంబర్స్కు తెలిపారు. అయితే మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు ఆ వ్యక్తికి గాయాలైనట్లు గుర్తించారు. దీంతో దర్యాప్తు మొదలుపెట్టారు.
గత ఏడేళ్ల నుంచి బంకిమ్ సూరి అనే ట్రాన్స్పోర్టు వ్యాపారి(Transport Businessman) వద్ద శివమ్ పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల ప్రముఖ వ్యాపారవేత్త కన్హయ్య హౌజరీకి చెందిన ఓ ప్యాకేజీ మిస్సైంది. ఆ ప్యాకేజీ విషయంలో అనుమానం వచ్చిన ప్రతి ఉద్యోగిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. మేనేజర్ శివమ్ మర్డర్ కేసులో కన్హయ్య షాపు ఓనర్ నీరజ్ గుప్తా కూడా ఉన్నాడు. మొత్తం ఏడు మంది మర్డర్ కేసు నమోదు అయ్యింది. పోస్టుమార్టమ్లో మరిన్ని నిజాలు బయటపడనున్నట్లు భావిస్తున్నారు.