చెన్నై : తమిళనాడు రాష్ట్రం జల్లికట్టు పోటీలకు సిద్ధమవుతోంది. సంక్రాంతి పండుగకు జల్లికట్టు పోటీలను నిర్వహించనున్న నేపథ్యంలో ఎద్దులకు, వాటిని అదుపు చేసే యువకులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. మధురైలో ఓ ట్రాన్స్జెండర్ ఆరు ఎద్దులకు శిక్షణనిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ట్రాన్స్జెండర్ కీర్తన్ మాట్లాడుతూ.. జల్లికట్టు కోసం తాను ఎద్దులకు శిక్షణ ఇస్తున్నాను. ప్రతి రోజు తాము ఎద్దులకు ట్రైనింగ్ ఎక్సర్సైజ్ నేర్పిస్తున్నాము. తనకు మరో ఇద్దరు ట్రాన్స్జెండర్లు సహాయం చేస్తున్నారని పేర్కొంది. ఏదైనా సాధించడానికి జెండర్తో పని లేదని కీర్తన్ స్పష్టం చేసింది.
జల్లికట్టు పోటీలకు ప్రసిద్ధిచెందిన మదురై, పుదుకోట, సేలం జిల్లాల్లో పోట్లగిత్తలను పెంచుకుంటున్న యజమానులు జనవరి 2వ వారంలో జరుపుకోబోయే జల్లికట్టుకు సిద్ధం చేస్తున్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో కొవిడ్ నిబంధనల మేరకు తక్కువ మంది ప్రేక్షకులతో జల్లికట్టు పోటీల నిర్వహణకు ప్రభుత్వం అనుమతించే అవకాశముందని పోటీ నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు.