కొత్త సంవత్సర వేడుకల కోసం హిమాచల్ ప్రదేశ్కు పర్యాటకులు పోటెత్తడంతో తలెత్తిన ట్రాఫిక్ కష్టాలను తప్పించుకోవడానికి ఓ వ్యక్తి ఏకంగా లాహాల్ లోయలోని చంద్ర నదిలో వాహనాన్ని నడిపాడు.
సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ ఘటనపై స్థానికులు విమర్శలు వ్యక్తం చేశారు. పోలీసులు డ్రైవర్కు చలానా విధించారు.