భోపాల్: మధ్యప్రదేశ్లో అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ నెలకొన్నది. అయితే కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావచ్చని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ (Exit Polls ) అంచనా వేశాయి. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 17న పోలింగ్ జరిగింది. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 116. మొత్తం మీద కాంగ్రెస్ 111-121, బీజేపీ 106-116, ఇతర పార్టీలకు 0-6 సీట్లు రావచ్చని తెలుస్తున్నది.
జన్ కీ బాత్ అంచనా ప్రకారం కాంగ్రెస్కు 102-125, బీజేపీకి 100-123, ఇతరులు 0-5 స్థానాలు రావచ్చని తెలుస్తున్నది.
రిపబ్లిక్ టీవీ- మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్కు 97-107, బీజేపీకి 118-130, ఇతర పార్టీలకు 0-2 సీట్లు రావచ్చని అంచనా.
టీవీ 9 భరత్వర్ష్ – పోల్స్టర్ ప్రకారం కాంగ్రెస్కు 111-121, బీజేపీకి 106-116, ఇతరులకు 0-6 సీట్లు గెలుస్తాయని పేర్కొంది.
దైనిక్ భాస్కర్ సర్వే ప్రకారం కాంగ్రెస్కు 105-120, బీజేపీకి 95-115, ఇతర పార్టీలకు 0-15 సీట్లు రావచ్చని తెలుస్తున్నది.
న్యూస్ 24-టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్కు 74, బీజేపీకి 151, ఇతర పార్టీలకు 5 స్థానాలు రానున్నాయి.