చండీఘఢ్ : పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 26,454 పోస్టులను భర్తీ చేసేందుకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసిందని సీఎం భగవంత్ మాన్ తెలిపారు.
ఒక ఎమ్మెల్యే ఒక పెన్షన్ పధకానికీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పధకంలో భాగంగా ఎమ్మెల్యేల ఆదాయ పన్నును పంజాబ్ ప్రభుత్వం చెల్లించదు. ఆప్ కలల ప్రాజెక్టుగా పేరొందిన ఇంటింటికీ రేషన్ డెలివరీ పధకానికి కూడా క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.
చిన్న రవాణాదారుల డిపాజిటింగ్ పీజు గడువును పెంచాలని నిర్ణయించింది. వాయిదాల్లోనూ రవాణాదారులు ఫీజును డిపాజిట్ చేసే వెసులుబాటు కల్పించింది. తమ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను సీఎం భగవంత్ మాన్ వెల్లడిస్తూ తమ ప్రభుత్వం గొప్ప నిర్ణయాలు తీసుకోవడమే కాదు వాటిని నెరవేర్చేందుకు కృషి చేస్తామని తెలిపారు.