ఓ మహిళ గొంతులో టూత్బ్రష్ ఇరుక్కుపోయింది. ఈ ఘటన తమిళనాడులోని కాంచిపురంలో చోటు చేసుకుంది. 34 ఏళ్ల రేవతి అనే మహిళ ఉదయమే బ్రష్ చేసుకుంటుండగా.. కాలు జారి వాష్రూమ్లో పడిపోయింది. దీంతో తన తల నేలకు గట్టిగా తాకింది. దీంతో తన నోటిలో ఉన్న బ్రష్ తన గొంతులో ఇరుక్కుపోవడమే కాదు.. తన చెంపను చీల్చుకుంటూ సగం బయటకు వచ్చింది.
వెంటనే తనను కాంచిపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తన పరిస్థితిని చూసిన డాక్టర్లు.. ఆ టూత్బ్రష్.. రేవతి చెంపను చీల్చుకుంటూ సగం బయటికి రావడం వల్ల చెంప నుంచే దాన్ని బయటకు తీయాలని భావించారు. సగం టూత్బ్రష్.. తన పళ్ల కింద ఇరుక్కుపోయింది. దీంతో చెంపపై ఇంకాస్త చీలక పెట్టి.. తన నోటి లోపల ఇరుక్కుపోయిన బ్రష్ను బయటికి తీశారు డాక్టర్లు. సర్జరీ విజయవంతం కావడంతో.. తన నోట్లో ఇరుక్కున్న బ్రష్ను డాక్టర్లు బయటికి తీయడంతో అక్కడి స్థానికులు డాక్టర్లను ప్రశంసిస్తున్నారు.