చెన్నై : తమిళనాడులోని కూనూర్ వద్ద హెలికాఫ్టర్ కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 11కి పెరిగింది. ఈ విమానంలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన భార్యతో పాటు 14 మంది ప్రయాణిస్తున్నారు. ఇప్పటివరకూ 11 మృతదేహాలు లభించాయని అధికారులు తెలిపారు. ఆర్మీ హెలికాఫ్టర్ బుధవారం సులూర్ నుంచి వెల్లింగ్టన్కు వెళుతుండగా కూనూర్ వద్ద కుప్పకూలింది.
హెలికాఫ్టర్ కూలిన సమయంలో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగమంచు అలుముకుంది. ప్రమాద ఘటనపై వాయుసేన దర్యాప్తునకు ఆదేశించింది. ఆర్మీ హెలికాఫ్టర్ కుప్పకూలిన ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక ఈ ఘటనపై పార్లమెంట్లో రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ ప్రకటన చేసిన అనంతరం ఘటనా ప్రాంతాన్ని సందర్శిస్తారు.