న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: నేడు పట్టణాలు, నగరాలలో టీవీ ప్రసారాలతో సమానంగా ఓటీటీ వేదికలు ఆదరణ పొందుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రంగంలోకి ప్రవేశించి ఒక ఓటీటీ వేదికను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నదని కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు. ఈ ఏడాది కొత్త ఎఫ్ఎం రేడియో స్టేషన్లకు వేలం నిర్వహిస్తామని, ఒక ఓటీటీ వేదికను ఏర్పాటు చేస్తామని, మొబైల్ ఫోన్లకు నేరుగా టీవీ ప్రసారాలను అందించే ప్రయోగాలు చేస్తామని వెల్లడించారు.