పట్నా: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై బీహార్ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ కీలక నేత తేజస్వి యాదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీహార్ పర్యటనను మీరు ఎలా చూశారు అన్న ప్రశ్నకు తేజస్వి ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఆయన ఇక్కడికి ఎవరినైనా భయపెట్టడానికి వచ్చిండా అని ప్రశ్నించారు.
ఆయన దేశానికి హోమంత్రి, కాబట్టి అంతా హోంమంత్రిగానే చూస్తారు అని తేజస్వి యాదవ్ వ్యాఖ్యానించారు. కానీ తనకు మాత్రం అమిత్ షా ఒక రాజకీయ నాయకుడిగా గానీ, హోంమంత్రిగా గానీ కనిపించలేదని ఆయన చెప్పారు. అయినా ఆయన ఎలా కనిపిస్తున్నాడో చెప్పాల్సిన అవసరం తనకు లేదన్నారు.
హోంమంత్రి అమిత్ షా ఇవాళ బీహార్లోని పూర్ణియా జిల్లాలో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సభలో ప్రసంగించిన ఆయన.. తన రాక లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్కుమార్ ద్వయానికి కడుపులో నొప్పిగా మారిందని ఎద్దేవా చేశారు. ఇటీవలే నితీశ్కుమార్ బీజేపీకి షాకిచ్చి.. లాలూ నేతృత్వంలోని ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.