భోపాల్: శిశువుకు శ్వాసకోశ వ్యాధి సోకింది. అయితే మూఢ నమ్మకంతో రోగం నయం చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. ఎర్రగా కాల్చిన ఇనుప రాడ్తో శిశువుకు వాతలు పెట్టారు. ఈ నేపథ్యంలో పసి బాబు మరణించాడు. (Infant Dies) మధ్యప్రదేశ్లోని షాహ్దోల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బంధ్వా గ్రామంలో నెలన్నర రోజుల కిందట పుట్టిన శిశువుకు న్యూమోనియా సోకింది. శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధ పడుతున్న ఆ పసి బిడ్డ రోగం నయం చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. మూఢ నమ్మకంతో కాల్చిన ఇనుప రాడ్తో శిశువు శరీరంపై వాతలు పెట్టారు.
కాగా, కాలిన గాయాలైన పసి బిడ్డ అనారోగ్యం మరింతగా క్షిణించింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు డిసెంబర్ 21న జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీంతో పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (పీఐసీయూ)లో ఉంచి చికిత్స అందించినట్లు డాక్టర్ జీఎస్ పరిహార్ తెలిపారు. అయితే శుక్రవారం ఆ పసి బాబు మరణించినట్లు ఆయన వెల్లడించారు.