న్యూఢిల్లీ: వైవాహిక బంధంలో ఉన్న వారి మధ్య అత్యాచారం అంశం గురించి ఇవాళ రాజ్యసభలో సీపీఐ ఎంపీ బినయ్ విశ్వమ్ ఓ ప్రశ్న అడిగారు. వివాహ బంధంలో ఉన్న వారి మధ్య వేధింపులు ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా ఐపీసీలోని 375 సెక్షన్లో ఉన్న రేప్ నిర్వచనం గురించి ఆయన ప్రస్తావించారు. ఆ సెక్షన్లో ఉన్న రేప్ హక్కు గురించి ఆయన నిలదీశారు. డొమెస్టిక్ వాయిలెన్స్లో సెక్షన్ 3, ఐపీసీలోని 375 సెక్షన్ గురించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన అడిగారు. దీనిపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు.
దేశంలో జరిగే ప్రతి పెళ్లి హింసాత్మకమే అని ఖండించలేమని, ప్రతి వ్యక్తిని రేపిస్ట్గా చిత్రీకరించడం సరికాదు అని మంత్రి స్మృతి అన్నారు. మారిటల్ రేప్ అంశం కోర్టు పరిధిలో ఉందని ఆమె తెలిపారు. మహిళలకు హెల్ప్ చేసేందుకు దేశంలో 30 హెల్ప్లైన్లు ఉన్నాయన్నారు. మహిళలు, చిన్నారులను రక్షించుకోవడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆమె అన్నారు. అయితే ప్రతి వ్యక్తి రేపిస్ట్ అని తాను అనడం లేదని ఎంపీ విశ్వమ్ అన్నారు.
ప్రశ్నోత్తరాల సమయంలో ఇదే అంశంపై బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ మాట్లాడారు. మారిటల్ రేప్ను నేరంగా పరిగణిస్తారా అని ఆయన ప్రశ్నించారు. వివాహ బంధంలో రేప్కు ఇమ్యూనిటీ ఇవ్వడం వల్ల వివాహ వ్యవస్థ నిర్వీర్యమవుతుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. భార్యకు ఇష్టపూర్వకమా కాదా అన్న అంశాన్ని నిర్ధారించడం కష్టమే అన్నారు. అయితే కోర్టు పరిధిలో ఈ అంశం ఉండడం వల్ల తాను ఇంతకన్నా ఎక్కువ ఏమీ మాట్లాడలేనని మంత్రి స్మృతి అన్నారు.