లక్నో, నవంబర్ 15: సంగీతం పట్ల ఎనలేని ఆసక్తి.. 82ఏండ్ల రిటైర్డ్ ఇంజినీర్ను కాలేజీలో చేరేట్టు చేసింది. మ్యూజిక్లో పీహెచ్డీ పూర్తిచేయాలన్న కలను సాకారం చేసుకునేందుకు ఉత్తరప్రదేశ్లోని బాలియాకు చెందిన రిటైర్డ్ ఇంజినీర్ జగదీశ్ ప్రసాద్ శర్మ (82) కాలేజీ బాట పట్టారు. ఇక్కడి టౌన్ డిగ్రీ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారు. ‘చిన్నప్పట్నుంచీ సంగీతమంటే ఎంతో ఇష్టం. పరిస్థితులు అనుకూలించక ఈ రంగంలోకి వెళ్లలేకపోయా’ అని చెప్పారు. వయసు పెరిగినా, చిన్నప్పటి హాబీస్ అలానే కొనసాగుతున్నాయని చెప్పారు. సంగీతం పట్ల జగదీశ్ శర్మ చూపుతున్న శ్రద్ధను కాలేజీ మ్యూజిక్ ప్రొఫెసర్ అరవింద్ ఉపాధ్యాయ ప్రశంసించారు. సహ విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపిందన్నారు.