TN’s Road Accident | తమిళనాడులో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. తిరుచ్చి జిల్లా మనపరైలోని వాయంబటి వద్ద జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు కారు ఎస్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించినట్లు తిరుచ్చి ఎస్పీ సుజీత్కుమార్ తెలిపారు. ఎస్టీసీ బస్సును కారు ఢీకొట్టిందని, సంఘటన స్థలంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. కారులో టైరు పేలడంతో బస్సును ఢీకొట్టిందని చెప్పారు. కారును ఆర్టీసీ బస్సు డ్రైవర్ తప్పించేందుకు యత్నించారు. ఈ క్రమంలో బస్సు సైతం అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 34 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. పలువురు ప్రయాణికులకు గాయాలు కాగా.. దగ్గరలో ఉన్న ఆసుపత్రికి పంపినట్లు వివరించారు.
Trichy, Tamil Nadu | Five people died after a government bus and a car collided on the national highway near Vayambatti near Manaparai in Trichy district. The car lost control due to a wheel burst & collided with the government bus. Five people in the car died on the spot and 34… pic.twitter.com/9dmTPVSC34
— ANI (@ANI) June 25, 2023