చండీఘఢ్ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర బీజేపీ పాలిత హర్యానాలో కొనసాగుతోంది. మహిళా సాధికారత లక్ష్యంగా కాంగ్రెస్ పోరాడుతున్న క్రమంలో సోమవారం పెద్దసంఖ్యలో మహిళలు ముందుండి రాహుల్ యాత్రను నడిపించారు. పెద్దసంఖ్యలో మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు యాత్రలో పాలుపంచుకున్నారు.
భారత్ జోడో యాత్రలో సోమవారం అందరూ మహిళలే పాల్గొంటారని, ఇది చాలా భావోద్వేగ దినమని..మహిళా సాధికారత పట్ల రాహుల్ చిత్తశుద్ధితో ఉన్నారని కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి ట్వీట్ చేశారు. నవంబర్ 19న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఆరోజున కూడా రాహుల్తో కలిసి మహిళలు పాదయాత్రలో పాల్గొన్నారని గుర్తుచేశారు.
డిసెంబర్లో మరోసారి మహిళా సశక్తికరణ్ దినం సందర్భంగా కూడా మహిళలు రాహుల్ మార్చ్లో పెద్ద ఎత్తున కలిసి నడిచారని పేర్కొన్నారు. ఇక తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ శత్రుఘ్న సిన్హా రాహుల్ యాత్రపై ప్రశంసలు గుప్పించారు. భారత్ జోడో యాత్రతో రాహుల్ ప్రతిష్ట పెరిగిందని ఆయన తదుపరి ప్రధాని అయ్యే సామర్ధ్యం ఉందని పేర్కొన్నారు.