కోల్కతా: ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో భారీగా నోట్ల కట్టలు పట్టుబడటం, మంత్రి పార్థా ఛటర్జీని ఈడీ అరెస్టు చేయడం పశ్చిమ బెంగాల్లో కలకలం సృష్టిస్తున్నది. పార్థాను ఇప్పటికీ మంత్రివర్గంలో కొనసాగించడంపై సొంత పార్టీలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. అతనని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలనే వాదన వస్తున్నది.
పార్థా ఛటర్జీని క్యాబినెట్ నుంచి, పార్టీ పదవుల నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలని టీఎంసీ జనరల్ సెక్రెటరీ కునాల్ ఘోష్ డిమాండ్ చేశారు. తన స్టేట్మెంట్ను తప్పుగా భావిస్తే తనను అన్ని పదవులను తొలగించే హక్కు పార్టీకి ఉందని చెప్పారు. తాను టీఎంసీ సైనికుడిగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఈ మేరకు కునాల్ ఘోష్ ట్వీట్ చేశారు.
Partha Chatterjee should be removed from ministry and all party posts immediately. He should be expelled.
If this statement considered wrong, party has every right to remove me from all posts. I shall continue as a soldier of @AITCofficial.— Kunal Ghosh (@KunalGhoshAgain) July 28, 2022
ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో మంత్రి పార్థా ఛటర్జీని ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ ఇంట్లో ఈడీ అధికారులు గత శుక్రవారం సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.21 కోట్ల నగదు లభించింది. విచారణ సందర్భంగా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈడీ అధికారులు అర్పితకు చెందిన మరో అపార్ట్మెంటులో బుధవారం సోదాలు చేశారు. అక్కడ లభించిన రూ.29 కోట్ల నగదు, 5 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు.