అధికార తృణమూల్ ఎమ్మెల్యే మనోరంజన్ వ్యాపారి బిహారీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహారీ.. బిమారీలు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బిహారీలు రోగగ్రస్తులని, బెంగాల్ మాత్రం రోగ రహిత రాష్ట్రమని ఆయన పేర్కొన్నారు. కోల్కత్తా బుక్ ఫెయిర్ వేదిగా జరిగిన ఓ సమావేశంలో ఆయన ప్రసంగించారు.
మీ నరనరాల్లో బెంగాలీ రక్తం ప్రవహిస్తుంటే.. మీ రక్తంలో నేతాజీ, ఖుదీరాం బోస్ రక్తమే ప్రవహిస్తుంటే.. మీరు మీ మాతృభాష, మాతృభూమిని ప్రేమిస్తే… ఏక్ బిహారీ… సౌ బీమారీ… (ఒక్క బిహీరీ.. 100 రోగాలతో సమానం) అని బిగ్గరగా అరవాలి. మనకు రోగాలు వద్దు. రోగ రహిత బెంగాల్ మన లక్ష్యం కావాలి. జై బంగ్లా.. జై మమతా బెనర్జీ అంటూ ఎమ్మెల్యే మనోరంజన్ వ్యాపారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్లో అంత సవ్యంగా ఉంటే.. బిహారీలందరూ తిరిగి వెళ్లిపోవాలని అన్నారు.