కోల్కతా, ఏప్రిల్ 18: లోక్సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ అనంద బోస్ మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారని అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మండిపడింది. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల ప్రక్రియలో గవర్నర్ తరచూ జోక్యం చేసుకుంటున్నారని, దీనిని నిరోధించాలంటూ గురువారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ప్రచారం ముగిసి నిబంధనలు అమలులో ఉన్నప్పటికీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పర్యటించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. మొదటి విడత ఎన్నికలకు ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున, గవర్నర్ వెంటనే తన కూచ్ బెహార్ పర్యటనను రద్దు చేసుకునేలా ఆదేశించాలని టీఎంసీ కోరింది.