కోల్కతా: కేంద్రంలోని బీజేపీ సర్కార్పై ఉత్తరాల ఉద్యమానికి బెంగాల్ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. రాష్ర్టానికి ఉపాధి హామీ పథకం నిధులు నిలిపివేయడంతో కోట్లాది మంది కూలీలు ఆకలితో అల్లాడుతున్నారని టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తీరుకు నిరసనగా కోటి మంది కూలీల సంతకాలతో ప్రధాని మోదీకి నెల రోజుల్లో లేఖలు పంపుతామని శనివారం వెల్లడించారు. నిధులను వెంటనే విడుదల చేయకపోతే ఢిల్లీ వీధుల్లో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. గత ఏడాది ఏప్రిల్ 16 నుంచి ఈ పథకం కింద నమోదైన వారి సంఖ్య 1.38 కోట్లు ఉందని, అయితే వారెవ్వరికీ గత ఏడాదిగా 100 రోజుల ఉపాధి హామీ పథకం అమలు కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.