కోల్కతా: కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్గా ఫిర్హాద్ హకీమ్ పేరు ఖరారయ్యింది. ఫిర్హాద్ హకీమ్కు గతంలో కూడా కోల్కతా మేయర్గా పనిచేసిన అనుభవం ఉండటం, పైగా తనకు అత్యంత సన్నిహితుడు కావడంతో పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధ్యక్షురాలు మమతాబెనర్జి నూతన మేయర్గా ఆయన పేరును ఖరారు చేశారు. కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం సాధించింది. కార్పొరేషన్లోని మొత్తం 144 వార్డులకుగాను టీఎంసీ 134 వార్డులను కైవసం చేసుకుంది. స్వత్రంత్రులుగా గెలిచిన ముగ్గురు కూడా మమతకు మద్దతు ప్రకటించారు.
కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్కు ఈ నెల 19న పోలింగ్ జరిగింది. 21న ఓట్లను లెక్కించారు. ఆ రోజు లెక్కింపు జరుగుతుండగానే మమతాబెనర్జి.. ఈ నెల 23న మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశమై మేయర్ అభ్యర్థిని ఎన్నుకుంటామని ప్రకటించారు. టీఎంసీ విజయం దాదాపు ఖాయమై పోవడంతో అప్పుడామె ఆ ప్రకటన చేశారు. ఆ మేరకు ఇవాళ మధ్యాహ్నం సమావేశమై మేయర్ అభ్యర్థిగా ఫిర్హాద్ హకీమ్ను ఎన్నుకున్నారు.