కోల్కతా : పశ్చిమ బెంగాల్లో ఉప ఎన్నికలు జరిగిన నాలుగు నియోజకవర్గాల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. దీంతో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. డప్పు దరువులకు స్టెప్పులేస్తూ ఊగిపోతున్నారు. స్వీట్లు పంచుకుంటున్నారు. దీన్హత నియోజకవర్గంలో టీఎంసీ అభ్యర్థి ఉదయన్ గుహ లీడ్లో ఉన్నారు. గోసాబ నియోజకవర్గంలో టీఎంసీ అభ్యర్థి సుబ్రతా మండల్ ఆధిక్యంలో ఉన్నారు. ఖర్దహ్ నియోజకవర్గంలో శోభన్ దేవ్ ఛటోపాధ్యాయ(టీఎంసీ), శాంతిపూర్లో కిశోర్ గోస్వామి(టీఎంసీ) ముందంజలో ఉన్నారు.