కోల్కతా, ఏప్రిల్ 19: టీఎంసీ జాతీయ పార్టీ హోదాను ఈసీ రద్దు చేసిన తర్వాత తాను కేంద్ర హోం మంత్రి అమిత్షాకు ఫోన్ చేశానని బీజేపీ నేత సువేందు చేసిన ఆరోపణలను టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమత బుధవారం ఖండించారు.
ఆరోపణలను నిరూపిస్తే, సీఎం పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. టీంఎసీ జాతీయ హోదా రద్దు తర్వాత అమిత్షాకు మమత ఫోన్ చేశారని, జోక్యం చేసుకొని, టీఎంసీ జాతీయ హోదాను పునరుద్ధరించాలంటూ ఆయన్ను కోరారని సువేందు ఆరోపించారు.