న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో లాక్డౌన్ విధించబోమని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. అయితే కరోనా మహమ్మారి నివారణకు కొత్త ఆంక్షలు అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో ఏడు నుంచి పది రోజులకు సరిపడా కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులో ఉందన్నారు. ఢిల్లీలో ప్రస్తుతం కరోనా నాలుగో వేవ్ కొనసాగుతుందని తెలిపారు. తమకు తగినంత మోతాదులో వ్యాక్సిన్లను అందించినట్లు అయితే.. ఎక్కువ సంఖ్యలో టీకా కేంద్రాలను ఓపెన్ చేస్తామన్నారు. రెండు, మూడు నెలల్లో వ్యాక్సిన్ ప్రక్రియను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. గత కొద్ది రోజుల నుంచి కొవిడ్పై వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్న సీఎం కేజ్రీవాల్ ఇవాళ ఎల్ఎన్జేపీ ఆస్పత్రిలో సమీక్ష నిర్వహించారు.
ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,521 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 39 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 1,45,384 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.