బైక్పై ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా పులి దాడి చేసింది. బైక్ డ్రైవ్చేస్తున్న వ్యక్తిని అడవిలోకి లాక్కెళ్లింది. ఈ హృదయ విదారక ఘటన ఉత్తరాఖండ్లోని కార్బెట్ నేషనల్ పార్క్ సమీపంలో జరిగింది. అతడి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. అడవిలో అతడిని పులి విడిచిపెట్టిందా? లేదా చంపి తినేసిందా? అనే వివరాలు తెలియలేదు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. బాధితుడిని అఫ్జల్గా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అప్జల్, అనాస్ అనే ఇద్దరు వ్యక్తులు కార్బెట్ నేషనల్ పార్క్ సమీపం నుంచి బైక్పై వెళ్తున్నారు. ఆ సమయంలో బైక్ గంటకు 60 కి.మీ. స్పీడ్తో దూసుకెళ్తున్నది. ఇంతలో పులి ఎంటర్ అయ్యింది. డ్రైవింగ్ చేస్తున్న అఫ్జల్పై దాడిచేసింది. అతడిని అడవిలోకి లాక్కెళ్లింది. అనాస్ బైక్ను స్టార్ట్ చేసి వేగంగా పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. పోలీసులకు జరిగినదంతా వివరించాడు. ఈ ఘటన గత శనివారం రాంనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోహన్ ప్రాంతంలో జరిగినట్లు సమాచారం. కాగా, ఈ ఘటనపై స్థానికులు ఆందోళనకు దిగారు. అటవీశాఖ అధికారుల పనితీరుపై వ్యతిరేక నినాదాలు చేశారు.