SP-RLD Tieup in UP? | వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేశ్ యాదవ్, జయంత్ చౌదరి చేతులు కలుపనున్నారని తెలుస్తోంది. దీనికి సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్తో దిగిన ఫొటోను రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ (ఆర్ఎల్డీ) అధినేత జయంత్ చౌదరి మంగళవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు పొడుపు వార్తలకు విశ్వసనీయత లభిస్తున్నది.
ఆర్ఎల్డీ పూర్తిగా పశ్చిమ యూపీ కేంద్రంగా పని చేస్తున్న పార్టీ. జాట్ సామాజిక వర్గానికి పెట్టింది పేరుగా ఉన్న పశ్చిమ యూపీలో పూర్తిగా జయంత్ చౌదరి పట్టు కలిగి ఉన్నట్లు సమాచారం. ఎస్పీ, ఆర్ఎల్డీ మధ్య పొత్తు కుదిరితే వచ్చే ఎన్నికల్లో ఎస్పీకి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, 2019 లోక్సభ ఎన్నికల్లో మాయావతి సారధ్యంలోని బీఎస్పీతో పెట్టుకున్న పొత్తు సమాజ్వాదీ పార్టీకి పెద్దగా కలిసి రాలేదు. ఈ నేపథ్యంలో వచ్చే చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని అఖిలేశ్ యాదవ్ ఆసక్తిగా ఉన్నారు. ఇంతకుముందు ఈ నెల 19న సమాజ్వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుంటామని జయంత్ చౌదరి ఓ వార్తా సంస్థకు చెప్పారు. నెలాఖరు నాటికి ఒక రూపానికి వస్తుందన్నారు.