న్యూఢిల్లీ: దేశ పౌర విమానయాన నియంత్రణ సంస్థ అయిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విమాన ప్రయాణికులకు తీపి కబురు చెప్పింది. ప్రయాణించే క్లాస్ను విమానయాన సంస్థలు తగ్గించిన పక్షంలో ప్రభావితమైన ప్రయాణికులకు టిక్కెట్ ధరలో కొంత మొత్తం తిరిగి చెల్లించాలని విమానయాన సంస్థలను ఆదేశించింది. దీనికి సంబంధించిన సివిల్ ఏవియేషన్ రిక్వైర్మెంట్ (సీఏఆర్) సెక్షన్ 3ని సవరించినట్లు బుధవారం ప్రకటించింది. కొత్త నిబంధన ప్రకారం విమాన ప్రయాణ తరగతిని అసంకల్పితంగా డౌన్గ్రేడ్ చేసే విమానయాన సంస్థలు సంబంధిత ప్రయాణికుడికి టిక్కెట్ ధరలో కొంత శాతం తిరిగి చెల్లించాలని పేర్కొంది. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు సంబంధించిన రీయింబర్స్మెంట్ విధానాన్ని బుధవారం వెల్లడించింది.
ఈ కొత్త నిబంధన ప్రకారం దేశీయ విమాన ప్రయాణికుల క్లాస్ను విమానయాన సంస్థలు తగ్గించిన సందర్భాల్లో పన్నులతో సహా టిక్కెట్ ధరలో 75 శాతం మొత్తాన్ని ఆ ప్రయాణికుడికి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ విమాన ప్రయాణ క్లాస్ను విమానయాన సంస్థలు తగ్గించిన సందర్భాల్లో 1500 కిలోమీటర్లు లేదా అంతకంటే తక్కువ దూరం ప్రయాణించే వారికి పన్నులతో సహా టిక్కెట్ ధరలో 30 శాతం చెల్లించాలి. 1500 కిలోమీటర్ల నుంచి 3500 కిలోమీటర్ల మధ్య ప్రయాణాలకు పన్నులతో సహా టిక్కెట్ ధరలో 50 శాతం, 3500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే వారికి పన్నులతో సహా టిక్కెట్ ధరలో 75 శాతం రీయింబర్స్మెంట్ ఇవ్వాలి.
మరోవైపు డీజీసీఏ కొత్త నిబంధన వల్ల విమాన ప్రయాణికులకు ఎంతో లబ్ధి కలుగనున్నది. బోర్డింగ్ నిరాకరించడం, విమానాల రద్దు, విమానాల ఆలస్యం కారణంగా ఎక్కలేని విమాన ప్రయాణీకులకు వారు కొనుగోలు చేసిన టిక్కెట్ ధరలో కొంత మొత్తాన్ని విమాన సంస్థలు విధిగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఎగువ క్లాస్ నుంచి దిగువ క్లాస్కు టిక్కెట్ను డౌన్గ్రేడ్ చేయడం వల్ల ప్రభావితమైన విమాన ప్రయాణికుల హక్కులను బలోపేతం చేయడం కోసం డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది.
For International Sector: 30% of the cost of ticket including taxes for flights of 1500km or less. 50% of the cost of ticket including taxes for flights between 1500km to 3500km. 75 % of the cost of ticket including taxes for flights more than 3500km: DGCA
— ANI (@ANI) January 25, 2023