పుణె: మహారాష్ట్రలోని పుణె సిటీలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మూడేళ్ల వయసున్న తన ఇద్దరు కవల కుమార్తెలు, భార్యతో కలిసి స్కూటీపై వెళ్తున్న ఓ వ్యక్తిని వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీ కింద పడిపోవడంతో తలలకు గాయాలైన చిన్నారులిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. స్కూటీ నడుపున్న తండ్రి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
పుణెలోని విశ్రాంత్ వాడి చౌక్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పిల్లల మృతదేహాలను పోస్టు మార్టానికి పంపించామని, తీవ్రంగా గాయపడిన తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నదని పోలీసులు తెలిపారు. ప్రమాదం అనంతరం పారిపోయిన ట్యాంకర్ డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.