Encounter in Dantewada | ఛత్తీస్గఢ్లోని దంతేవాడ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు మృతి చెందారని పోలీసు అధికారులు తెలిపారు. దంతేవాడ జిల్లా కాటే కల్యాణ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అద్వాల్, కుంజేరా గ్రామాల మధ్య గల అటవీ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
జిల్లా రిజర్వు గార్డ్ (డీఆర్జీ) పోలీసులు గాలింపు చేపట్టినప్పుడు మావోయిస్టులు తారసపడ్డారని జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ పీటీఐకి తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మరణించారన్నారు. మరణించిన వారిని రాజేముచక్కి, గీతామార్కాం, భీమే నుప్పో అలియాస్ జ్యోతి అని గుర్తించినట్లు అభిషేక్ పల్లవ చెప్పారు. వారు ఒక్కొక్కరిపై రూ.5 లక్షల చొప్పున రివార్డు ఉందని తెలిపారు.
వారు మావోయిస్టు కాటేకల్యాణ్ ఏరియా కమిటీలో యాక్టివ్ కార్యకర్తలు అని అన్నారు. ఘటనాస్థలం నుంచి ఒక 12 బోర్ గన్, రెండు కంట్రీమేడ్ రివాల్వర్లు, గన్, మందుగుండు సామగ్రి, మావోయిస్టు సాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.