శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో బుధవారం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు హతమార్చాయి. రాంభాగ్ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. ప్రస్తుతం బలగాలు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు ఉన్నారా? అని తెలుసుకునేందుకు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అయితే, ఎన్కౌంటర్లో హతమైన ఉగ్రవాదుల గురించి వివరాలు తెలియాల్సి ఉన్నది.