ముంబై : దేశ ఆర్ధిక రాజధాని ముంబైలోని బొరివలి (వెస్ట్) ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం, గాయపడిన వివరాలు వెల్లడికాకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. సాయిబాబా నగర్లోని సాయిబాబా ఆలయం సమీపంలోని గీతాంజలి బిల్డింగ్ మధ్నాహ్నం 12.34 గంటల ప్రాంతంలో కూలిపోయింది.
ఘటనా స్ధలానికి చేరుకున్న మెట్రపాలిటన్ ఫైర్, ఎమర్జెన్సీ సేవల మండలి, పోలీస్ సిబ్బంది సహాయక చర్యలను ప్రారంభించారు. భవనం శిధిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారేమోనని తనిఖీ చేస్తున్నారు. ఇక ఎనిమిది అగ్నిమాపక యంత్రాలు, రెస్క్యూ వ్యాన్లు, అంబులెన్స్లతో సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేశారు.