శ్రీనగర్, జనవరి 11: పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో లోతైన లోయలోకి జారిపడి జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జేసీవో)సహా ముగ్గురు సైనికులు దుర్మరణం చెందారు. జమ్ముకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్టు ఆర్మీ బుధవారం వెల్లడించింది. ‘మంగళవారం జేసీవో, ఇద్దరు సైనికులు ముందున్న పోస్టుకు వెళ్తుండగా, ఇరుకైన దారిలోని మంచుపలక విరిగిపోవడంతో ముగ్గురూ లోతైన లోయలోకి పడిపోయారు.’ అని ఆర్మీ ప్రతినిధి తెలిపారు. మృతులను పురుషోత్తం కుమార్ (43), అమ్రిక్సింగ్ (39), అమిత్ శర్మ (23)గా గుర్తించారు.