ముంబై: పబ్లిక్ టాయ్లెట్ను శుభ్రం చేయడానికి వెళ్లిన ముగ్గురు పారిశుధ్య కార్మికులు (Sanitation workers) సెప్టిక్ ట్యాంకులో పడి మృతిచెందారు. ముంబైలోని ఏక్తా నగర్లో మున్సిపల్ సిబ్బంది ముగ్గురు పబ్లిక్ టాయిలెట్ను శుభ్రం చేయడానికి వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు సెప్టిక్ ట్యాంక్ కూలడంతో అందుపడిపోయారు. ఊపిరాడకపోవడంతో దుర్మరణం చెందారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంధి ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులు సెప్టిక్ ట్యాంక్లోనుంచి వెలికితీవి శతాబ్ది దవాఖానకు తరలించారు. అయితే వారు అప్పటికే మరణించారని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.