Chennai Air Show | తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని మెరీనా బీచ్ వద్ద ఆదివారం నిర్వహించిన ఎయిర్ షోలో తొక్కిసలాట జరిగింది. దీంతో ఎయిర్ షోకు వచ్చిన సందర్శకులు, వీక్షకుల్లో ముగ్గురు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. ఎయిర్ షో చూడటానికి లక్షల మంది తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఎయిర్ షో ముగిసిన తర్వాత తిరిగి వెళుతున్నప్పుడు మద్రాస్ సెంట్రల్ రైల్వే స్టేషన్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసు, పౌర ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. మృతుల దేహాలను పోస్ట్ మార్టం కోసం స్థానిక ప్రభుత్వ దవాఖానకు, క్షతగాత్రులను చికిత్స కోసం స్థానిక దవాఖానలకు తరలించారు. ఈ ఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.