షాదోల్ : మధ్యప్రదేశ్లోని షాదోల్ జిల్లాలో గజరాజుల విధ్వంసం కొనసాగుతోంది. అడవి ఏనుగుల దాడిలో మరో ముగ్గురు మరణించడంతో జిల్లాలో ఈ తరహా ఘటనల్లో మరణించిన వారి సంఖ్య రెండు రోజుల్లో ఐదుకు పెరిగిందని అధికారులు తెలిపారు. చత్తీస్ఘఢ్లోని కెస్వహి నుంచి రాష్ట్రంలో ప్రవేశించిన ఏనుగుల దాడిలో మంగళవారం అంజోర్ అటవీ ప్రాంతంలో మోతీలాల్ బసోర్ (60) ఆయన భార్య ములియ బాయ్ (55) మరణించారు.
ఇక మహువ పూలను సేకరించేందుకు బుధవారం అడవికి వెళ్లిన బంసా గ్రామానికి చెందిన ఓ జంటతో పాటు మరో మహిళ ఏనుగుల దాడిలో ప్రాణాలు కోల్పోయారని జిల్లా కలెక్టర్ వందన వైద్య తెలిపారు. అడవి ఏనుగుల కదలికలపై అధికారులు, జిల్లా యంత్రాంగం హెచ్చరించినా బాధితులు అడవిలోకి వెళ్లారని మృతులను లల్లూ సింగ్ (50), ఆయన భార్య లలితా సింగ్ (48) వారి బంధువు బేబీ సింగ్ కన్వర్ (38)గా గుర్తించారు.
బాధిత కుటుంబ సభ్యులకు పరిహారం అందిస్తామని కలెక్టర్ తెలిపారు. సమీప గ్రామాల ప్రజలను కూడా అడవి ఏనుగుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించామని చెప్పారు. మహువా సేకరణ కోసం అడవిలోకి వెళ్లవద్దని స్ధానికులకు విజ్ఞప్తి చేశారు.