Chhattisgarh | రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో తుపాకులు గర్జించాయి. పీడియా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు – మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు సంభవించాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలంలో మందుగుండు సామాగ్రిని జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. పీడియా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం జవాన్లు జల్లెడ పడుతున్నారు.