విదిష : మధ్యప్రదేశ్ విదిషలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు జర్నలిస్టులు దుర్మరణం చెందారు. సలామత్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో భోపాల్ – విదిషా రోడ్డులోని లంబాఖేడా (బర్ఖేడి)లో సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో విదిషలో ప్రెస్క్లబ్ ప్రెసిడెంట్ రాజేశ్ శర్మతో పాటు సునీల్ శర్మ, నరేంద్ర దీక్షిత్ అనే జర్నలిస్టులు మృతి చెందారు. జర్నలిస్టుల మృతికి రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.