బెంగళూరు: కర్ణాటక లోక్సభ బరిలో ముగ్గురు మాజీ సీఎంలు బరిలో నిలిచారు. ఎన్టీయే కూటమి అభ్యర్థులుగా మాజీ సీఎంలు బసవరాజ్ బొమ్మై, జగదీశ్శెట్టర్, హెచ్డీ కుమారస్వామి లోక్సభ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. హవేరి నుంచి బొమ్మై, బెళగావి నుంచి శెట్టర్, మండ్య నుంచి కుమారస్వామి బరిలో నిలిచారు. వీరిలో బొమ్మై, శెట్టర్ లింగాయత్ సామాజిక వర్గానికి చెందినవారు కాగా, కుమారస్వామి వొక్కలిగ వర్గానికి చెందినవారు.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కర్ణాటకకు ఇప్పటి వరకు 23 మంది ముఖ్యమంత్రులుగా పనిచేస్తే అందులో 14 మంది పార్లమెంట్కు ప్రాతినిథ్యం వహించడం విశేషం. వీరిలో ఏడు మంది రాష్ట్ర రాజకీయాల నుంచి వైదొలగి జాతీయ రాజకీయాల్లో రాణించారు. మళ్లీ కేంద్రంలో ఎన్డీయే సర్కారు ఏర్పడితే.. బొమ్మై కూడా గెలిస్తే మోదీ మంత్రివర్గంలో ఆయనకు స్థానం లభించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి. వ్యవసాయ మంత్రి పదవి చేపట్టాలని ఉందని కుమారస్వామి ఇప్పటికే పేర్కొన్నారు.