పుణె: రాజ్యాంగ నిర్మాత బీఆర్ ఆంబేద్కర్, సంఘ సంస్కర్త జ్యోతిబా ఫులేపై మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నేత చంద్రకాంత్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఔరంగాబాద్లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యాసంస్థల కోసం అంబేద్కర్, ఫులే ప్రభుత్వ గ్రాంట్లు కోరలేదని.. నిధులు సేకరించాలని వారు ప్రజలను ‘అడుక్కున్నారు(బెగ్డ్)’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పింప్రిలో శనివారం ఆయనపై ఓ ఆందోళనకారుడు సిరా చల్లి తన నిరసన తెలిపారు.