హైదరాబాద్: తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలోని మారాయిగూడెం వద్ద లింగంపల్లి బేస్ క్యాంప్లో సీఆర్పీఎఫ్ (CRPF) జవాన్ల మధ్య సెలవుల విషయంలో ఘర్షణ తలెత్తింది. దీంతో ఓ జవాన్ తోటి జవాన్లపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను భద్రాచలం ప్రభుత్వ దవాఖానకు తలరించారు. అయితే చికిత్స పొందుతూ మరో జవాన్ కూడా మరణించారు. మృతులను బీహార్కు చెందిన రాజమణి యాదవ్, డంజి, పశ్చిమబెంగాల్కు చెందిన రాజుమండల్గా గుర్తించారు. కాగా, కాల్పులకు పాల్పడిన జవాన్ను అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.