మహాసముంద్, మార్చి 4: ఛత్తీస్గఢ్లోని ఓ ఆశ్రమంలో ఘోరం జరిగింది. ఆశ్రమానికి చెందిన ముగ్గురు వలంటీర్లు ఓ 13 ఏండ్ల బాలికను కొట్టి, ఆమె నోట్లో కాలుతున్న కట్టెను పెట్టడంతో తీవ్రంగా గాయపడింది. ఈ అమానుష ఘటన మహాసముంద్ జిల్లా పటేరపల్లిలోగల జై గురుదేవ్ మానస్ ఆశ్రమంలో గత నెల 24న చోటుచేసుకొన్నది. వివరాల్లోకెళితే, మానసిక సమస్యతో బాధపడుతున్న రాయ్పూర్లోని అభాన్పూర్ ఏరియాకు చెందిన బాలికను ఆమె అన్న భూతవైద్యం కోసం ఆశ్రమంలో చేర్పించి వెళ్లారు. అతడు వెళ్లిపోగానే ముగ్గురు వలంటీర్లు ఆ బాలికను చితకబాదారు.
అనంతరం బలవంతంగా కాలుతున్న కట్టెను నోట్లో కుక్కారు. కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పొద్దని బెదిరించారు. బాలిక అన్న ఫిర్యాదు మేరకు పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. ఆశ్రమ ఆపరేటర్ కమ్ హెడ్గురుతోసహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. బాధిత బాలికను మెరుగైన వైద్యం కోసం సమీప దవాఖానలో చేర్పించారు. ఆశ్రమంలో భూతవైద్యం పేరుతో ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై విచారణకు ఆదేశించినట్టు మహాసముంద్ ఎస్పీ వెల్లడించారు.