చండీగఢ్ : భారత్ – పాక్ సరిహద్దులో ఉన్న టర్న్ తరం జిల్లాలో మూడున్నర కిలోల ఆర్డీఎక్స్ను పంజాబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శిథిలావస్థకు చేరిన ఓ భవనంలో నిల్వ చేయగా.. రికవరీ చేసుకున్నారు. అమృత్సర్లోని అజ్నాలాకు చెందిన ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాక్లో ఉన్న హర్వింద్ సింగ్ సంధు అలియాస్ రిండా పంజాబ్లో ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్నట్లు పోలీస్ అధికారులు భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే పాక్ ఉగ్రవాదులకు ఆశ్రయం రిండా ఆశ్రయం కల్పిస్తూనే.. స్లీపర్ సెల్స్ సహాయంతో ప్లాన్ను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే రిండా పంపిన 3.50 కిలోల ఆర్డీఎక్స్ను టర్న్ తరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఎస్ఎస్పీ రజింత్ సింగ్ సైతం ధ్రువీకరించారు. టర్న్ తరం జిల్లాలోని నౌషాహ్రా గ్రామంలో శిథిలమైన భవనంలో దాచి ఉంచగా.. రికవరీ చేసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకోగా.. పూర్తి సమాచారం తెలియరాలేదు.
ఆర్డీఎక్స్ను స్వాధీనం చేసుకున్న తర్వాత నిఘా సంస్థ, పంజాబ్ ప్రత్యేక పోలీసు బృందాలు దర్యాప్తు ప్రారంభించారు. ఆర్డీఎక్స్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. భారత్లోకి ఎలా వచ్చింది ? ఎక్కడ వినియోగించేందుకు తెచ్చారనే ? కోణంలో విచారణ జరుపుతున్నారు. మరో వైపు కర్నాల్లో పట్టుబడిన నలుగురు ఉగ్రవాదులతో సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తున్నది.