ఇది బీహార్ రాజధాని పాట్నాలో ఉన్న గంగా ఘాట్. ప్రస్తుతం ఇది విద్యార్థులకు స్టడీ ఘాట్గా మారిపోయింది. వారాంతాల్లో ఇక్కడకు వందలాది మంది విద్యార్థులు చేరుకుని పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. బీహార్తో పాటు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఇక్కడికి వస్తున్నారు. ఎస్కే ఝా అనే టీచర్ వీరందరికీ ఉచితంగా పాఠాలు బోధిస్తుంటారు.
దాదాపు 12 నుంచి 14 వేల మంది అభ్యర్థులు పాఠాలు వినేందుకు వస్తారని ఝా చెబుతున్నారు. వీరంతా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులేనని, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, యూపీఎస్సీ సహా వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నట్టు పేర్కొన్నారు.