చండీగఢ్: ఇటీవల జరిగిన చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ ( Aravind Kejriwal ) హర్షం వ్యక్తంచేశారు. చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు పంజాబ్లో రాబోయే మార్పునకు సంకేతమని ఆయన వ్యాఖ్యానించారు. పంజాబ్ కాంగ్రెస్, బీజేపీల పతనం మొదలైందని చెప్పారు. ఈ మేరకు కేజ్రివాల్ ట్వీట్ చేశారు. కాగా, చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 35 వార్డులకుగాను ఆప్ అత్యధిక వార్డులను గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది.
మొత్తం 35 వార్డుల్లో ఆప్కు అత్యధికంగా 14 వార్డులు దక్కాయి. బీజేపీ 12 స్థానాల్లో మాత్రమే విజయం సాధించగలిగింది. ఇక పంజాబ్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 8 స్థానాలకే పరిమితమైంది.