AIR INDIA : ఎయిరిండియా రేపు ఓ ప్రత్యేకమైన ప్రకటన చేయబోతోంది.ఈ ప్రకటన చేస్తూ ప్రయాణికులకు స్వాగతం చెప్పనుంది. ఈ ప్రకటన ద్వారా ఎయిరిండియా టాటాలో కలిసిపోయిందన్న వార్త ప్రయాణికులకు తెలపనుంది టాటా సంస్థ. ‘ప్రియమైన ప్రయాణికుడా నేను మీ కెప్టెన్ను మాట్లాడుతున్నాను. ఈ చారిత్రక విమానంలోకి మీకు స్వాగతం పలుకుతున్నాం. ఏడు దశాబ్దాల తర్వాత నేడు ఎయిరిండియా టాటా సంస్థలో విలీనమైంది. ఈ విమానంతో పాటు ఎయిరిండియా విమానాలన్నింటిలోనూ అత్యంత నిబద్ధతతో, సరికొత్త అభిరుచులతో సేవలందించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు మీ యాత్రను ఆనందిస్తారని మేము మనఃస్ఫూర్తిగా ఆశిస్తున్నాం’అన్న ప్రకటతో ప్రయాణికులకు స్వాగతం చెప్పడానికి టాటా సంస్థ సిద్ధమైపోయింది.
ఎయిరిండియాను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా టాటాసన్స్ గ్రూపుకు అప్పజెప్పింది. 18 వేల కోట్ల బిడ్తో టాటా ఈ ఎయిరిండియాను టేకోవర్ చేసుకుంది. టాటా సన్స్ గ్రూపు చేతుల్లోకి ఎయిరిండియా రావడం ఎంతో ఆనందంగా ఉందని టాటాసన్స్ గ్రూపు చైర్మన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. మరోవైపు ఈ ప్రక్రియ పూర్తి అయ్యే ప్ర్రక్రియలో భాగంగా టాటా సన్స్ గ్రూపు చైర్మన్ చంద్రశేఖరన్ గురువారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. దాదాపు 69 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఎయిరిండియా తిరిగి టాటాల వశమైంది.