భోపాల్: మధ్యప్రదేశ్కు చెందిన బీజేపీ నేత ఆరేళ్ల తర్వాత బూట్లు ధరించాడు. (BJP Leader Wears Shoes) మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో తన కాళ్లకు బూట్లు తొడిగాడు. ఆరేళ్ల కిందట చేసిన ప్రతిజ్ఞను తాజాగా నెరవేర్చాడు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనుప్పూర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాందాస్ పూరీ ఒక నిర్ణయం తీసుకున్నాడు. బీజేపీ అధికారంలోకి వచ్చే వరకు కాళ్లకు చెప్పులు లేదు బూట్లు ధరించనని 2017లో ప్రతిజ్ఞ చేశాడు.
కాగా, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు వల్ల కమల్ నాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయింది. దీంతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అయితే రాందాస్ పూరీ తన మాటకు కట్టుబడి ఉన్నాడు. సొంత మెజార్టీతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయక పోవడంతో గత ఆరేళ్లుగా కాళ్లకు చెప్పులు లేదా బూట్లు ధరించలేదు. పార్టీ సమావేశాల్లో కూడా అలాగే పాల్గొనేవాడు.
మరోవైపు ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో అనుప్పూర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాందాస్ పూరీ తన ప్రతిజ్ఞను నెరవేర్చాడు. శనివారం మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో తన కాళ్లకు బూట్లు ధరించాడు. చౌహాన్ ఈ వీడియో క్లిప్ను ఎక్స్లో పోస్ట్ చేశారు.
रामदास पुरी जैसे कार्यकर्ता पार्टी की शक्ति और पूंजी हैं…
अनूपपुर के भाजपा जिला अध्यक्ष श्री रामदास पुरी जी ने संकल्प लिया था कि जब तक प्रदेश में भाजपा की सरकार नहीं बनेगी, तब तक वे जूते चप्पल नहीं पहनेंगे।
प्रदेश में भाजपा की सरकार बन गयी और उनका संकल्प पूरा होने पर हमने… pic.twitter.com/3Q50QThen3
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) December 23, 2023