శ్రీనగర్: ఉమ్మడి పౌరస్మృతి చట్టాన్ని తీసుకువచ్చేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫారూక్ అబ్దుల్లా(Farooq Abdullah) స్పందించారు. యూనిఫామ్ సివిల్ కోడ్ అంశలో కేంద్రం తొందరపడి చర్యలు తీసుకోవద్దు అన్నారు. ఉమ్మడి పౌరస్మృతి అమలు విషయంలో పర్యవసానాల గురించి పునరాలోచించాలని ఆయన సూచించారు. ఉమ్మడి పౌరస్మృతి గురించి మళ్లీ ఆలోచన చేయాలని, ఇది భిన్నత్వం కలబోసిన దేశమని, ఇక్కడ భిన్న మతస్తులు, భిన్న జాతుల ప్రజలు నివసిస్తున్నారని, ముస్లింలకు ప్రత్యేకమైన షరియత్ చట్టం ఉందని ఫారూక్ అబ్దుల్లా తెలిపారు. ఈద్ ఉల్ అజా ప్రార్ధనల్లో పాల్గొనేందుకు వచ్చిన అబ్దుల్లా ఈ వ్యాఖ్యలు చేశారు.
శ్రీనగర్ నుంచి లోక్సభ ఎంపీ అయిన ఫారూక్ అబ్దుల్లా మాట్లాడుతూ.. యూసీసీ అమలు చేస్తే ఏర్పాడబోయే పర్యవసానాల గురించి ప్రభుత్వం మళ్లీ మళ్లీ ఆలోచించాలన్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని, దీనిపై నిర్ణయం తీసుకోవాలని, పర్యవసానాల గురించి ఆలోచించాలని, ఎందుకంటే ఆ తర్వాత తుఫాన్ వస్తుందని ఆయన అన్నారు. జమ్మూకశ్మీర్కు వస్తున్న అమర్నాథ్ యాత్రికులకు ఆయన స్వాగతం పలికారు.
#WATCH | National Conference (NC) chief Farooq Abdullah speaks on Uniform Civil Code (UCC)
"They (Central govt) should think that the country is diverse, people of all religions live here, and Muslims have their own Shariat law. They should think about any possible storm that… pic.twitter.com/UZzNRtKuAw
— ANI (@ANI) June 29, 2023