UP Polls | నితీశ్ కుమార్ సారథ్యంలోని జేడీయూ.. బీజేపీకి ఝలక్ ఇచ్చింది. యూపీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించుకుంది. 51 సీట్లలో ఒంటరిగా బరిలోకి దిగుతున్నట్లు పేర్కొంది. పొత్తు విషయంలో బీజేపీని సంప్రదిస్తే, బీజేపీ కిమ్మనలేదని, దీంతో జేడీయూ ఒంటరిగానే బరిలోకి దిగడానికి సిద్ధపడిపోయింది. తమతో పొత్తుకు రెడీ అని కేంద్ర మంత్రి ఆర్సీపీ సింగ్ తొలుత అన్నారని, ఆ తర్వాత ఏమీ మాట్లాడటం లేదని జేడీయూ అధ్యక్షుడు లలన్ సింగ్ మండిపడ్డారు. ఇ
దే విషయం ముందే చెప్పేస్తే, తాము యూపీలో అత్యధిక సీట్లలో, మరింత బలంగా బరిలోకి దిగేవారమని లలన్ పేర్కొన్నారు. పొత్తు విషయంపై సంప్రదింపుల నిమిత్తమై, ఆయన పేరే సూచించారని, ఇతరులెవ్వరూ ఈ వ్యవహారాన్ని చూసుకోలేదన్నారు. బీజేపీతో మాట్లాడేందుకు ఆర్సీపీ సింగ్కు మాత్రమే జేడీయూ అధికారమిచ్చిందని, కేంద్ర మంత్రి చెప్పడంతోనే ఇన్ని రోజులు వేసి చూసే ధోరణతితో ఉన్నామని, ఇక ఇప్పుడు స్వతంత్రంగా బరిలోకి దిగుతామని లలన్ సింగ్ ప్రకటించారు.