న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సిన్కు కొరత లేదని ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎమ్మార్) ప్రకటించింది. వచ్చే జూలై రెండో వారం లేదా ఆగస్టు మొదటి వారం వరకు రోజుకు కోటి డోసుల చొప్పున ఇచ్చినా సరిపోయే అన్ని వ్యాక్సిన్ డోసులు ఉన్నాయని తెలిపింది. వచ్చే డిసెంబర్ ఆఖరుకల్లా దేశంలోని ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ పూర్తవుతుందని, అందులో ఏ మాత్రం సందేహం లేదని ఐసీఎమ్మార్ వెల్లడించింది.