న్యూఢిల్లీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా నిష్పత్తి ప్రకారం ఓబీసీల రిజర్వేషన్లను పెంచే ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో స్పష్టం చేసింది. బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర పంచాయతీ రాజ్ సహాయ మంత్రి కపిల్ మహేశ్వర్ పాటిల్ సమాధానమిచ్చారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 243డీ ప్రకారం ఓబీసీలకు మూడో వంతు రిజర్వేషన్లు అమలవుతున్నాయన్నారు. ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించే హక్కు రాష్ర్టాలకు ఉన్నందున 21 రాష్ర్టాలు దీనిని 50 శాతానికి పెంచాయని ఆయన తెలిపారు.